ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు కాకా ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కాక జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి అని అనేక కార్మిక ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేశాడని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాక అని కొనియాడారు. హైదరాబాదులోని వందలాది బస్తీలతో గడ్డం వెంకటస్వామి జీవితం పెనవేసుకుందని పేద ప్రజల ఇండ్ల కోసం స్థల సౌకర్యం కల్పించిన మహానీయుడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాదిమంది కార్మికుల జీవితాలకు బాటలు వేశాడు, దేశంలోనే అత్యున్నత స్థానంలో సేవలు అందించిన వెంకటస్వామిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకా వీరాభిమాని కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి తిరుపతిరెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, నాయకులు పాలకుర్తి రాజేశం, బొల్లి స్వామి, అశోద అజయ్ కుమార్, సోగాల తిరుపతి, రామడుగు గంగారెడ్డి, తాళ్ల లింగయ్య, వోడ్నాల శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్ కంపెల్లి రాజేశం, కరేటి వేణు, ఏదుల్ల అంజయ్య, కాంపల్లి పోచయ్య, దేవి అఖిల్, దేవి కిషోర్, ఓరెమ్ చిరంజీవి, కొక్కుల రామనారాయణ, జక్కుల దామోదర్, దేవి లావణ్య, స్వామి, దేవేందర్ రెడ్డి, పెరుమండ్ల ప్రసాద్, సూర వెంకటేశం, అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.



