UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ లో అంబరాని అంటేలా సంబరాలు 

విజేతలకు బహుమతులు అందించిన తోట దేవిప్రసన్న, ఆళ్ల మురళి

సుజాతనగర్ / కొత్తగూడెం (తెలంగాణ వాణి) బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సుజాతనగర్ లో ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలు ‘చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’ అంటూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని జెండాల సెంటర్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పలువురు మహిళా నాయకులతో పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం వాణి రెడ్డి, రమాదేవి, సంధ్య, రాజ్యలక్ష్మి, అరుణ తదితరులతో కలిసి సంస్కృతి-సాంప్రదాయం కనబడేలా సుందరంగా బతుకమ్మలను పేర్చిన ముగ్గురిని విజేతలుగా నిర్ణయించగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, దేవిప్రసన్న తదితరులతో కలిసి వారికి పట్టు చీరలు బహుకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి వచ్చిన నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సోసైటీ చైర్మన్ మండే హనుమంత్ రావు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్స్ ఎండి రజాక్, పితాంబరం, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐవైసి కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్, సుజాతనగర్ నాయకులు మడుపల్లి శ్రీనివాసులు గౌడ్, లోశెట్టి నాగార్జున, ఎస్కె అబిద్, సాధుల నర్సింహారావు, చిమట నాగేశ్వరరావు ఎస్కె మౌలా సాహెబ్, చుంచుపల్లి మండల మాజీ అధ్యక్షులు కున్సోత్ కిషన్, లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు పూణేం శ్రీనివాస్, బాల పాసి, బాలిశెట్టి సుందర్ రాజు, పోస్ట్ ఆఫీస్ వాసు, కేకే శ్రీను, మందా హనుమంత్, జానీ భాయ్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు కసనబోయిన రామ్మూర్తి, జీడి మహేష్, కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest