UPDATES  

NEWS

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

 వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు

వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు

వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) :

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల కారణంగా రోజువారి కూలీకి వెళ్లే నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందని, పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తాము వారికి చేయూతనివ్వడానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది తెలిపారు.ఇలానే ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పెంటాల మహేష్ కు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు మారుతి,శ్రావణ్,సాయి రాజ్,అక్షయ రెడ్డి,జయంత్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest