UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 UPI పేమెంట్స్ సక్సెస్ వెనుక సూపర్ ఉమెన్.. ఇండియా చెల్లింపుల వ్యవస్థలో కీ రోల్

పేమెంట్ వ్యవస్థలో UPI విధానం ఓ గేమ్‌ ఛేంజర్ అని చెప్పవచ్చు. నడిరోడ్డుపై కూడా సెకన్ల వ్యవధిలో భారతీయులు నగదు బదిలీ జరపడాన్ని కనీసం ఎవరూ ఊహించి ఉండరు.

కానీ దీన్ని సుసాధ్యం చేయడంలో ఓ మహిళ ప్రముఖ పాత్ర పోషించారని చాలా మందికి తెలియదు.

దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ కీలకంగా వ్యవహరించారు. ఆమె వ్యూహాత్మక సూచనల నుంచి సంస్థ ఎంతో ప్రయోజనం పొందినట్లు సాక్షాత్తూ NPCI CEO దిలీప్ అస్బే కూడా అంగీకరించారు. పేమెంట్స్ ఇండస్ట్రీలో గ్యాప్స్ మరియు ఇబ్బందులను గుర్తించడంలో రాయ్‌కు మంచి నైపుణ్యం ఉన్నట్లు తెలిపారు.

 

సంవత్సరాలుగా బ్రాండ్‌లను నిర్మించడంలో, సినర్జీలను అభివృద్ధి చేయడంలో మరియు ప్రభావవంతమైన చెల్లింపుల పరిష్కారాలలో రాయ్ తనదైన ముద్ర వేశారు. NPCIలో బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, పాలసీ మేకర్స్ మరియు రెగ్యులేటర్‌ల వంటి పరిశ్రమ వాటాదారులతో సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం NPCI ఉత్పత్తుల వృద్ధిని ప్రోత్సహించడం, UPI మరియు రూపే వంటి ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తుల కోసం కొత్త యూజ్ కేసులను పరిచయం చేయడం వంటి బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నారు. ఆమె మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ బ్యాంకర్ కూడా. IIM-అహ్మదాబాద్ నుంచి MBA పూర్తిచేసిన అనంతరం బ్యాంకింగ్ వర్టికల్స్, టెక్నాలజీ మరియు మార్కెటింగ్‌లో నైపుణ్యాన్ని పెంచుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest