UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ

కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి)

ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని, ఆడతామో అందాల ఆనంద పౌర సమాజ నిర్మాత అని తెప్పాల్సిన పని లేదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఏట ఒక ప్రత్యేక ఉచిత ఫర్టిలిటీ సేవలు పొందడానికి అర్హులైన 10 మందిని లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసుకొని లక్షల విలువైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా కల్పిస్తున్న రెనీ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్ బంగారి స్వామి, డైరెక్టర్ డా.రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాట, పాట కలగలిపి అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఉచిత సంతాన సాఫల్య వైద్య సేవలు పొందే పది మందిని లక్కీడిప్‌ ద్వారా 348 మందిలో 10 మందిని ఎంపిక చేసారు. డా రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ తమ అత్త పేరిట ప్రతి ఏట 20 లక్షల విలువైన సంతాన సాఫల్య ఉచిత సేవలు అందించడం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. డా బంగారి స్వామి మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణ పడి ఉన్నామని,తమ ఆసుపత్రి ద్వారా ఏడాదికి 50 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మధుప్రియను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. డా కెప్టెన్‌ బుర్ర మధుసూదన్ రెడ్డి సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా రవీంద్రారెడ్డి చారి, డీన్ డా.మునీష్, గుండె వైద్య నిపుణులు డా.దినకర్ తాటిమట్ల, జనరల్ ఫిజీషియన్ డా.నిఖిల్ లక్ష్మణ్, డా లతీష్ రెడ్డి, నాన్ క్లినికల్ డైరెక్టర్ మేకల అరవింద్‍ రావు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest