UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 రాజీ మార్గమే రాజా మార్గం : జిల్లా జడ్జి సునీత కుంచాల

శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం 

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి 

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టులలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. భూమి తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్ రుణాలకు సంబంధించి మైంటనేన్స్ తదితర కేసులు పరిష్కరించబడతాయన్నారు. అదేవిధంగా కొందరు వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటివారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇరుపక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను సంబంధించి నష్ట పరిహారం కోసం వేసిన కేసులలోని బాధితులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించితే ఒక నెల రోజుల వ్యవధిలో పూర్తి మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసుల్లో కూడా న్యాయ సేవాసంస్థను సంప్రదిస్తే వారికి కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. 3 నెలలకు ఒక సారి వచ్చే జాతీయ లోక్ అదాలత్ ను కేసులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు వినియోగించుకోవాలాన్నారు. ఈ సమావేశంలో న్యాయా సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, కోర్టు సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest