UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 జర్నలిస్టులకు అండగా ఉంటా : ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిడులు తగ్గించుకుంటు జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటించిన అరవింద్ ను జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు అభివృద్ధి పనులు తదితర అంశాలపై

చర్చించారు. ఇటీవల వివిద కారణాలతో మృతి చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుస మరణాలు బాధాకర మన్నారు. అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఆపద సమయంలో బీజేపీ నాయకులకు ఆదుకుంటున్నానని ఫౌండేషన్ సేవలకు జర్నలిస్టులకు వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్ సీనియర్ జర్నలిస్టులు ప్రమోద్, ప్రసాద్ శ్రీనివాస్, దేవీదాస్, సుదర్శన్ ఆంజనేయులు, అహ్మద్, భూపతి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest