UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి..సర్పంచ్ అజ్మీర లైలా

లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అజ్మీర లైలా గ్రామంలోని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.తాగునీరు, డ్రైనేజీ,విద్యుత్, రహదారుల వంటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని చరవాణి ద్వారా సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో నేరుగా మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గిరిజన బాలలాజీ స్వామివారి కళ్యాణంకు హాజరైన:గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ 

గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని సంపత్ నగర్‌లో గిరిజన బాలలాజీ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొండపల్లి గోపాలకిషన్, రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు అక్కినపల్లి సోమాచార్యులు, యజ్ఞికులు రంగం అజయ్ కుమార్, సాయి చక్రి చార్యులు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇస్లావత్ బాలు బృందం సమన్వయం చేశారు. ఈ వేడుకలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్వామివారి […]

మండల స్థాయి బాల్ మేళా 2.0 ఘన విజయవంతం, అభినందించిన ఎంఇఓ సూరయ్య

స్థానిక చంద్రుగొండ మండల పరిధిలోని మూడు కాంప్లెక్స్‌ల పరిధిలో చంద్రుగొండ రేపల్లెవాడ, పోకులగూడెం కేంద్రాల్లో బాల మేళా 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సురయ్య, చంద్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి,రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.లైబ్రరీ, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో ప్రతి తరగతి నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి మండల స్థాయికి పంపించారు. మూడు సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు గోల్డ్ […]