అన్ని పరిశీలించినాకే పరీక్షా కేంద్రాల్లో అనుమతి
పలువురు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఈ నేపద్యంలో కొత్తగూడెం లక్ష్మీ దేవి పల్లిలో ఓ కాలేజ్ నందు విద్యార్థులను పూర్తిగా పరిశీలించి పరీక్షా హాల్లో పంపిస్తున్నారు.
ఉపాధి కల్పన లక్ష్యంగా విద్యార్థులకి శిక్షణ
ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ . కే. దేవసేన తెలిపారు. ఇటీవల కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు […]