UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 ఉపాధి కల్పన లక్ష్యంగా విద్యార్థులకి శిక్షణ

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ . కే. దేవసేన తెలిపారు. ఇటీవల కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు శిక్షణకు అర్హులు అన్నారు. జూన్ మాసం లో రాష్ట్ర వ్యాప్తంగా 239 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో పాటు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైతం నియమ నిబంధనల ప్రకారం శిక్షణకు అర్హులన్నారు శిక్షణ అనంతరం ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు . పదవ తరగతి , ఇంటర్మీడియట్ , ఐటీఐ, పాలిటెక్నిక్ , డిగ్రీ పూర్తి చేసిన , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు , చదువు మధ్యలో మానేసి 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు మల్లాపూర్ గురుకుల పాఠశాల కాలేజీలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు వివరాలకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించా లని ప్రిన్సిపల్ దేవసేన ఒక ప్రకటనలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest