UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 ఉపాధి కల్పన లక్ష్యంగా విద్యార్థులకి శిక్షణ

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ . కే. దేవసేన తెలిపారు. ఇటీవల కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు శిక్షణకు అర్హులు అన్నారు. జూన్ మాసం లో రాష్ట్ర వ్యాప్తంగా 239 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులతో పాటు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సైతం నియమ నిబంధనల ప్రకారం శిక్షణకు అర్హులన్నారు శిక్షణ అనంతరం ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు . పదవ తరగతి , ఇంటర్మీడియట్ , ఐటీఐ, పాలిటెక్నిక్ , డిగ్రీ పూర్తి చేసిన , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు , చదువు మధ్యలో మానేసి 18 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు మల్లాపూర్ గురుకుల పాఠశాల కాలేజీలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు వివరాలకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించా లని ప్రిన్సిపల్ దేవసేన ఒక ప్రకటనలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest