అమెరికాకు మరో ఉపద్రవం.. ఆందోళనలో ప్రజానీకం

బర్డ్ ఫ్లూ అనగానే పక్షులకు వస్తుందని తెలుసు. కోళ్లు ఎక్కుగా బర్డ్ఫ్లూ బారిన పడతాయి. అయితే తాజాగా అమెరికాలు ఆవులకు కూడా బర్డ్ ఫ్లూ సోకింది. ఆవు పాలల్లో బర్డ్ఫ్లూ ఉన్నట్లు టెక్సాస్ యనిమల్ హెల్త్ మిషన్ అధికారులు గుర్తించారు. AH5N1 టైపు వైరస్గా ధ్రువీకరించారు. ఇది దశాబ్దాలుగా పక్షుల్లో వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అప్గ్రేడ్ అయి పశువులకు సోకిందని, మనుషులకు సోకే అవకాశం కూడా ఉందని గుర్తించారు. ఆరు రాష్ట్రాల్లో వైరల్.. అమెరికాలోని టెక్సాస్, […]
తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

ఇస్లామిక్ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ విషయాన్ని ఈ […]
అమెరికాలో కుప్పకూలిన భారీ వంతెన.. హాలీవుడ్ మువీ రేంజ్లో బ్రిడ్జిని ఢీ కొన్న నౌక!

అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో బాల్టీమోర్ నగరంలో మంగళవారం (మార్చి 26) ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిపై నిర్మించిన బ్రిడ్జిని సరుకుతో వెళ్తున్న భారీ నౌక ఢీ మంగళవారం తెల్లవారు జామున ఢీకొట్టింది. దీంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడంతో వంతెన కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు నదిలో గల్లంతయ్యారు. […]
ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్ మ్యూజియంలో చోరి.. 1800కుపైగా పురాతన వస్తువులు కాజేసిన ఇంటి దొంగ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ మ్యూజియంలో దొంగలు పడ్డారు. దాదాపు 1,800 ఏళ్ల నాటి పురాతన వస్తువులను, ఖళాఖండాలను దొంగలు చోరీ చేశారు. అనంతరం గుట్టుగా ఆన్లైన్లో విక్రయించేందుకు యత్నించారు. ఆనక ఇంటి దొంగే ఈ చోరీకి యత్నించినట్లు తెలుసుకున్న మ్యూజియం నిర్వాహకులు ఖంగుతిన్నారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియంలో సంరక్షణాధికారిగా ఉన్న పీటర్ హిగ్స్ వాటిని అపహరించి ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. 2023 జులైలోనే మ్యూజియంలోని 1800కుపైగా […]
మాల్దీవులకు చైనా నీటి సాయం.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు చేరవేసిన డ్రాగన్

భారత్తో వివాదం తర్వాత మాల్దీవులకు చైనా మరింత దగ్గరైంది. మాల్దీవులకు అన్నివిధాలా సాయం చేసేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధమైంది. తాజాగా మాల్దీవుల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి 1500 టన్నుల తాగునీరును చైనా అందజేసింది. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్లోని హిమనీ నదాల నుంచి చైనా వీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది. టిబెట్ అటానమస్ రీజియన్ ఛైర్మన్ యాన్ జిన్హాయ్ మాల్దీవుల్లో గతేడాది నవంబరులో పర్యటించిప సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు […]
ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. భారత సంతతి వైద్యురాలికి ఆర్థిక సాయం.. !

కరోనా మహమ్మారి 2020 ఏడాదిని తలకిందులు చేసింది. ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు మొదలు.. వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసి కెనడాలోని భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ చలించిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్, టీకా ఆదేశాలకు తీవ్ర విమర్శలు ఎదరయ్యాయి. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. ఆమెపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాటి నుంచి కోర్టు […]
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్.. ఎందుకో తెలుసా.?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్ రైల్వే. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పర్వదినానికి ముందు రోజు జరిగిన ఈ సంఘటన […]
కేరళ సీఎం కుమార్తె వీణా విజయన్తోపాటు ఆమె ఐటీ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్ కేసు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేరళలో భారీ చర్యలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణతో పాటు ఆమెకు చెందిన ఐటీ కంపెనీతో పాటు ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వీణాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వీణా విజయన్ ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు చేసిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కేరళ సీఎం పినరయి […]
‘రాజకీయ ఒత్తిడి నుంచి న్యాయవ్యవస్థ ముప్పు’.. సీజేఐకి 600 మంది న్యాయవాదులు లేఖ

దేశవ్యాప్తంగా ప్రముఖ న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే లక్ష్యంతో నిర్దిష్ట ఆసక్తి సమూహం చర్యలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిడిపై తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ప్రమాదంలో ఉన్న న్యాయవ్యవస్థను కాపాడాలంటూ లేఖపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్ మరియు స్వరూపమ చతుర్వేది సహా […]
బెంగళూరే కాదు.. హైదరాబాద్తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

వేసవి ప్రారంభంకాక ముందే బెంళూరులో నీటి కష్టాలు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు నగర వాసుల జీవనం దినదినగండంగా మారింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం ప్రజలు బకెట్ నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బెంగళూర్ నగరం పూర్తిగా భూగర్భ జలాలు, కావేరీ నది నీటీపై ఆధారపడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సమస్య మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు […]