UPDATES  

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్‌ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్ 

NEWS

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు PRTU TS జిల్లా అసోసియేట్ అధ్యక్షులు టి.రవీందర్ కు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సును జయప్రదం చేయండి:అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రు ఆళ్లపల్లి ఉప సర్పంచ్‌గా సయ్యద్ ఆరీఫ్ ను సన్మానించిన కిక్‌ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అర్షద్  పుట్టిన రోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు పూణెం శ్రీనివాస్ నాగమణి దంపతులు పుట్టిన రోజు వేడుకలకు హాజరైన లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత తిరుమలేష్ దంపతులు మానవత్వం చాటుకున్న ఆటో భాయ్ అవీర్..అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్  నర్సంపేట బీసీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

 ‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం

వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై అధికారికంగా గూగుల్‌కి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇలాంటి ఛానళ్ల ప్రచారంపై జాగ్రత్త ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ఛానళ్లను ఇక ఉపేక్షించేది లేదని న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఛానళ్లపై పరువు నష్టం ధావాతోపాటు, కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంతో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం’ అని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరిత, చట్టవిరుద్ధ వీడియోలను, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ‘ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్నన్నా. ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం’ అని కేటీఆర్‌ తెలిపారు

గతంలో తమపై అసత్య ప్రచారం, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్‌తో వార్తల పేరిట ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూట్‌కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని తెలిపారు.

ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని యూట్యూబ్‌ ఛానళ్లకు కేటీఆర్‌ హెచ్చరించారు. కుట్రపూరితంగా వ్యవహారించే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం శిక్షకు సిద్దంగా ఉండాలని చెప్పారు. కుట్రపూరిత, అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్‌ ఛానళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న సమయంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూట్యూబ్‌ ఛానళ్లు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయి. గతంలో చూసీచూడకుండా వ్యవహరించిన గులాబీ పార్టీ ఇప్పుడు వాటిపై యుద్ధానికి దిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest