UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

కిన్నెరసాని గ్రామ పంచాయతీలో మహిళలలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ వజ్జ రామకృష్ణ,ఉపసర్పంచ్ వజ్జ ఇంద్రజా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మహిళల సృజనాత్మకతను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.మొదటి బహుమతి తాటి రామ, ద్వితీయ బహుమతి బోనగిరి శ్రీలత, తృతీయ బహుమతి బుడగం హేమలతలకు దక్కాయి. బహుమతులను కొత్వాల శ్రీనివాస్ అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వజ్జ శ్యామ్ దంపతులు స్పాన్సర్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డ్ మెంబర్లు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest