భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి నందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి,పూల బోకేతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా,పాల్వంచ మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాస రావు,ప్రధాన కార్యదర్శి జి హరి సింగ్,సోషల్ మీడియా సభ్యుడు బి.మంగిలాల్, మండల ఉపాధ్యక్షుడు ఏ.విజయ భాస్కర్,సీనియర్ సభ్యుడు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8