UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం


– హాజరైన ఎడిటర్,స్టేట్ కో ఆర్డినేటర్,-స్టేట్  న్యూస్ కో ఆర్డినేటర్ బ్యూరోలు

కరీంనగర్ బ్యూరో మే 10 (తెలంగాణ వాణి)

జగిత్యాల జిల్లా ఎల్ ఎల్ జి గార్డెన్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల తెలంగాణ వాణి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె. వి. మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణి పత్రిక ఎడిటర్ జేరిపోతుల సంవత్, స్టేట్ కో-ఆర్డినేటర్ మామునూరి సంవత్, స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ అఫ్జల్ పఠాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో పి.రవికిరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో కే. మహేష్ హాజరయ్యారు. తెలంగాణ వాణి పత్రిక జర్నలిస్టులు ఆర్సీలు మండల విలేకరులు పలు అంశాలను పత్రిక ఎడిటర్, స్టేట్ కో ఆర్డినేటర్, స్టేట్ వ్యూస్ కో ఆర్డినేటర్ దృష్టికి జర్నలిస్టులకు ఉన్న సమస్యలను విన్నవించుకున్నారు. ఎడిటర్, స్టేట్ కో ఆర్డినేటర్, స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ మాట్లాడుతు పత్రికలో జరుగుతున్న పలు అంశాలను చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలను అనుసరించి ముందు పోవాలని సూచించారు.. ఎప్పటికప్పుడు పాత్రికేయులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. తెలంగాణ వాణి పత్రికలో సమస్యలపై కథనాలు రాస్తే అధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్యలు తీరుస్తుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై తెలంగాణ వాణి పత్రిక ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ వాణి పాత్రికేయులకు సమస్యలు ఉంటే వెంటనే స్పందించి వెన్నుదండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వై.రవి, సీనియర్ పాత్రికేయులు నాయిని శ్రీనివాస్, కోరుట్ల, మెట్ పల్లి, వేములవాడ, బోధన హుస్నాబాద్ ఆర్ సి లతో పాటు పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest