UPDATES  

NEWS

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

 ఇక ‘నెట్’ స్కోర్‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్లు

పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది.

మార్చి 13న యూజీసీ 578వ సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఈ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించి.. పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు నెట్ స్కోరును లెక్కలోకి తీసుకోవచ్చని తీర్మానించారు. ఒకే రకమైన కోర్సులలో అడ్మిషన్ల కోసం ఒకటికి మించి ప్రవేశ పరీక్షలను నిర్వహించకూడదని జాతీయ విద్యా విధానం చెబుతోంది. ఈ నిబంధన అమలులో భాగంగానే తాజా నిర్ణయాన్ని యూజీసీ తీసుకుంది. ప్రస్తుతానికి నెట్ పరీక్ష స్కోరును జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఇదీ ప్రాసెస్..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్‌లలో నెట్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంటారు. యూజీసీ నెట్ జూన్ -2024 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జూన్ 2024 నుంచి యూజీసీ నెట్‌లో అర్హత సాధించే అభ్యర్థులను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. జేఆర్ఎఫ్‌తో పీహెచ్‌డీ అడ్మిషన్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు మొదటి కేటగిరిలో ఉంటారు. జేఆర్ఎఫ్ లేకుండా పీహెచ్‌డీ అడ్మిషన్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్‌మెంట్లకు అర్హులైన వారు రెండో కేటగిరిలో ఉంటారు. కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్‌కే అర్హతను కలిగినవారు మూడో కేటగిరిలో ఉంటారు.నెట్ స్కోర్ ద్వారా పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం కేటగిరి రెండు, మూడులో ఉండే అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. వారి నెట్ స్కోర్‌ను 70 శాతం, పీహెచ్‌డీ ఇంటర్వ్యూలో వచ్చే మార్కులను 30 శాతం కలుపుకొని పీహెచ్‌డీ అడ్మిషన్‌పై నిర్ణయం తీసుకుంటారు. నెట్ స్కోర్ ఏడాదికాలం పాటు చెల్లుబాటు అవుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest