UPDATES  

NEWS

 ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

మంగళ వారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో పాల్వంచ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ లిక్కి విశ్రుత్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు అభ్యసించి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest