UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

మెదక్-నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రుల బృందాన్ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు, అందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రులకు నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తప్పక విజయం సాధించి తీరుతానని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుదిల్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest