UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు

వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు

వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) :

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల కారణంగా రోజువారి కూలీకి వెళ్లే నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందని, పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తాము వారికి చేయూతనివ్వడానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది తెలిపారు.ఇలానే ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు పెంటాల మహేష్ కు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు మారుతి,శ్రావణ్,సాయి రాజ్,అక్షయ రెడ్డి,జయంత్,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest