UPDATES  

NEWS

కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్

 లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు !

క్రీడాకారులకు పోరాట సూర్తిని నింపిన సెక్రటరీ వెంకటస్వామి కోచ్ స్నేహ

హనుమకొండ:మార్చి08

(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)

హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ (జె.ఎన్.ఎస్) ఇండోర్ స్టేడియం ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేడియంలో ప్రతిరోజూ కఠిన సాధన చేసే క్రీడాకారిణులు,మరియు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ అనంతరం ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. క్రీడా ప్రాంగణమంతా బాలికల కేరింతలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది.

ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా తైక్వాండో కార్యదర్శి గడ్డం వెంకటస్వామి మరియు కోచ్‌ గుడిపల్లి స్నేహ, మామునూరి సంపత్ లు మాట్లాడుతూ మహిళా దినోత్సవ విశిష్టతను మరియు ఐక్యరాజ్యసమితిలో మహిళల హక్కులను,అసమానతలను వివరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారకురాలైన ఉద్యమ నాయకురాలు క్లార జేట్కిన్ పోరాట స్ఫూర్తి ని వివరించారు.అంతేకాకుండా నేటి సమాజంలో క్రీడారంగం మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్నే కాకుండా అపారమైన గౌరవాన్ని,ఉన్నత భవిష్యత్తును కల్పిస్తోందని వారు పేర్కొన్నారు.బాలికలు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని,పట్టుదలతో శ్రమిస్తే అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించడం అసాధ్యమేమీ కాదని వారు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. క్రీడల్లో రాణించడం ద్వారా క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇవి జీవితంలో ఏ రంగంలోనైనా విజయానికి పునాది వేస్తాయని హితబోధ చేశారు.ప్రపంచవ్యాప్తంగా మహిళా అథ్లెట్లు సాధిస్తున్న ఘనతలను ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, స్టేడియంలో శిక్షణ పొందుతున్న బాలికలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మరియు క్రీడా శాఖ కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని భవిష్యత్తులో జిల్లాకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులైన బాలబాలికలు, ఎస్.అభిగ్న, ఎ.సహస్ర, బి.కీర్తిక,బి.జాహ్నవి

ఎం.సహస్ర సంపత్, ఎం.స్రమజ సంపత్, ఎ.హిమాన్ష్ ఎస్.శ్రీయాన్ కె.శ్రీరుద్రేశ్వర సాయి ఎం.యువిన్‌రాజ్ బి.ఈషాన్ పి.సంజయ్ కుమార్ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest