
హనుమకొండ:మార్చి03
(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)
హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు.
ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
ఈ సందర్భంగా తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రటరీ గడ్డం వెంకటస్వామి మాట్లాడుతూ “క్రీడలు మనకు క్రమశిక్షణను నేర్పిస్తే,ఇలాంటి పండుగలు స్నేహభావాన్ని,ఐక్యతను పెంచుతాయని నిత్యం పోటీలు,ప్రాక్టీస్ ఒత్తిడిలో ఉండే పిల్లలకు ఈ రంగుల పండుగ ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని అన్నారు.ఈ వేడుకల్లో స్టేడియం కోచ్లు,గుడిపల్లి స్నేహ మామునూరి సంపత్ సీనియర్ క్రీడాకారులు,డాక్టర్ జగన్ మోహన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ,ఎస్ రవికుమార్,అల్లాడి తిరుమలశ్రీ తో పాటు తదితరులు పాల్గొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.స్టేడియం ప్రాంగణమంతా విద్యార్థుల కేరింతలు, నవ్వులతో సందడిగా మారింది.
