UPDATES  

NEWS

 ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని స్మరించుకొని ఇల్లందు లో తిరంగా ర్యాలీ

పెహల్గావ్‌లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ఇల్లందు జగదంబ సెంటర్ లో తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఆపరేషన్ సింధూర్’ విజయాన్ని స్మరించుకునేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు.శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతీయ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఏకతాటి పై ఉండాల‌ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుగులోత్ గణేష్, శ్రీను భూక్యా, గుగులోత్ దేవా,శివ కృష్ణ, విమల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest