UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 అనుమానాస్పద స్థితిలో గురుకుల విద్యార్థి మృతి..!

జిల్లెలగడ్డ గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలోని ఘటన

శోక సముద్రంలో మునిగిన తల్లితండ్రులు…

హుస్నాబాద్: అక్టోబర్ 7

తెలంగాణ వాణి రూరల్ ప్రతినిది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం వివేక్ ఈనెల 6న తిరిగి పాఠశాలకు వచ్చాడు. మంగళవారం ఉదయం పాఠశాల భవనం రెండో అంతస్తు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న తాడు మెడకు చుట్టుకోవడంతో కిందపడ్డాడు. దీనితో మెడకు ఉరి బిగుసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

పాఠశాలలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలో ఆడుకుంటున్న సమయంలో కింద పడటంతో గాయాలయ్యాయని, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయులు తమకు సమాచారం అందించారని విద్యార్థి తండ్రి తెలిపారు. తాము ఇక్కడికి వచ్చేసరికి తమ కుమారుడు చనిపోయి ఉన్నాడని తెలిపారు. ఉపాధ్యాయులు తెలిపిన ప్రకారం ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest