UPDATES  

NEWS

రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం కొత్తగూడెంలో నయా ల్యాబ్‌ దందా ? అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ ముందస్తు అరెస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు అందరూ సోదర భావంతో ముందుకు సాగుదామని,ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్

 రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని,ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.జె. బాలు మాట్లాడుతూ ఇప్పటివరకు 46,500 మందికి రక్తం అందించామని,ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత ఉండేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో సి.ఐ. ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, వీరునాయక్, భరత్, రాజేష్, జుబ్బు, జయశ్రీ, కమలారాణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest