ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు,మహాతత్వవేత్త కారల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు అన్నారు.మార్క్స్ 143వ జయంతిని శనివారం సుగుణ గార్డెన్స్లో ఘణంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటనికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్క్స్ ప్రతిపాదించిన సమానత్వభావాలు శ్రమ జీవుల హక్కుల కోసం చేసిన సిద్ధాంత పోరాటం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి నమాన హక్కులు సాధించాలన్న లక్ష్యంతో ఆయన చేసిన కృషి ఎప్పటికీ స్పూర్తి దాయకమని చెప్పారు. ప్రస్తుత కాలంలో కూడా మార్క్స్ ఆలోచనలు సమాజ మార్పుకు మార్గం చూపుతున్నాయని, కార్మికులు, రైతులు ఐఖ్యంగా పోరాడితేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.
Post Views: 8