పాల్వంచ పట్టణ పరిధిలోని జగ్గుతండా నవభారత్ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు బంజారా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్, గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ హాజరయ్యారు.టోర్నమెంట్ నిర్వాహకులు లావుడియా గణేష్, బానోత్ ప్రతాప్, గుగులోత్ సేవ్య, యన్ పర్షి, గుగులోత్ బాలు, భూక్యా రమేష్ ఆహ్వానం మేరకు వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతాయని అన్నారు. యువత ఇలాంటి క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ యువసేన జిల్లా అధ్యక్షులు బానోత్ భరత్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రు నాయక్, ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ కేశవ్, లావుడియా హనుమంతు తదితరులు పాల్గొన్నారు.