UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 గురుకులాల్లో మిగిలిన పోస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ పద్ధతిలో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వెంటనే అన్ని పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్‌ను, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని సూచించింది. తదుపరి చేపట్టే విచారణలోగా ప్రతివాదలు అందుకు సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.

కాగా, గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆ నియామకాల్లో ఎగువ, దిగువ భర్తీ చేయాల్సి ఉన్నా అన్నింటికీ ఒకేసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఒకేసారి మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్‌ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోవడంత మిగిలిన పోస్టులు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిపోయిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని కొరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest