లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్ నగర్ కాలనీ గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కొమరయ్య కాలనీలో డ్రైనేజీ కాలువలను సర్పంచ్ జర్పుల దేవి ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీటిని తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచే చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు మెంబర్ పడాల రమ, గ్రామపంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Post Views: 12

