ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రానికి చెందిన చిలుముల సాయి చరణ్ ఈ నెల 11న బంకేట్ హాల్ ముందు తన తండ్రి బైక్ పంచరై ఉండగా అట్టి బైకును రోడ్డు ఇవతల నుండి అవతల తన ఇంటి వైపుకు తోసుకుంటూ వెళుతుండగా పోలీస్ స్టేషన్ వైపు నుండి రాజారాంపల్లి వైపు వెళ్తున్న హుందాయి. ఐ20 కార్ నంబర్ ఏపి 29 సిబి 419 గల దానిని నడుపుకుంటూ వస్తున్న జిల్లా లోని మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయులు రాజేందర్ అను ఆతను అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టగా ఎగిరి నాలుగు గజాల దూరంలో పడి కుడికాలు మడమ భాగంలో తల వెనుక భాగంలో తీవ్ర రక్త గాయాలు అయినాయి. గాయపడ్డ విద్యార్ధి కరీంనగర్ లోని ఆరోగ్య ఆసుపత్రి లో చికిత్స పొంది ఆదివారం రాత్రి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ దార మధు బాధితుని ఇంటికి వెళ్లి పరమార్శించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం యాక్సిడెంట్ చేసిన రాజేందర్ తో చరవాణిలో మాట్లాడి విద్యార్థికి అయిన ఆసుపత్రి ఖర్చులు భరించాలని తెలిపారు.
