UPDATES  

NEWS

కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు 

 ఎస్సారెస్పీ పేస్-2 కు దామోదర్ రెడ్డి పేరు

దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తుంగతుర్తి, అక్టోబర్ 12,(తెలంగాణ వాణి ప్రతినిధి) శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మాజీ మంత్రి స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ జెండాను ఈ ప్రాంతంలో ఎగరవేసిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని సీఎం అన్నారు. రాజకీయాల్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తులను పేదలకు పంచడమే కాకుండా, తన అత్త కుటుంబ ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రాంత ప్రజలకు దానం చేశారని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సంతాపం తెలియజేయాల్సిందిగా తెలిపారని, వారి తరపున సర్వోత్తమ్ రెడ్డికి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ఏఐసీసీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో రాజకీయంగా అండగా ఉంటుందని తెలిపారు. నీళ్ల కరువు ప్రాంతమైన తుంగతుర్తికి శ్రీరామ్ సాగర్ జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి కరువు ప్రాంతమైన, ఫ్లోరైడ్ ప్రాంతమైన తుంగతుర్తికి నాటి సీఎం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి, మెప్పించి జలాలు తీసుకువచ్చిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ పేస్ – 2 కు పెడుతున్నట్లు ప్రజల హర్షద్వనాల మధ్య ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest