ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పూర్తిగా నిర్మూలించాలి
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ బోథ్ రేంజ్ సౌజన్యంతో బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవు పేడ ప్రమీలాలు (దీపాలు) పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతితో చేసిన వస్తువులు వాడకాన్ని అలవాటు చేసుకోవాలి అని అన్నారు కేసీఆర్ హయాంలో అటవులకు పునర్జీవం వచ్చింది అని అన్నారు ప్రకృతిని కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉన్నది అని అన్నారు పతిఒకరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ రేంజ్ ఆఫీసర్ ఫ్రణయ్, ఎంపీడీఓ రమేష్, సొసైటీ అధ్యక్షులు షేక్ అలీ, పురుషోత్తం, బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అధికారులు, మహిళలు పాత్రికేయలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.