UPDATES  

NEWS

 ఎమ్మార్పీఎస్ ధర్మారం మండల కమిటీ నియామకం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండల శాఖ అడహాక్ కమిటీని జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ నియమించారు. మండల కన్వీనర్ గా కమ్మరి ఖాన్ పేట గ్రామానికి చెందిన ఇరుగురాల మహేష్, కో కన్వీనర్ గా కొత్తూరు గ్రామానికి చెందిన నేరువట్ల అభిలాష్, మండల ఇన్చార్జిగా మద్దునాల మల్లేశం లను నియమించినట్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గానికి మహేష్ కృతజ్ఞతలు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest