UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలి

జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి)

దిగజారుడు రాజకీయాలకు ఆధ్యుడు హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అని, అలాంటి దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందంటూ తప్పుడు కూతలు కోస్తున్న కౌశిక్ రెడ్డి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాంపరింగ్ చేసే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ లు, లిక్కర్ స్కామ్ ల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి చెల్లుతుందని ఆకుతోట కుమారస్వామి తీవ్రంగా విమర్శించారు. గౌరవప్రదమైన శాసనసభ సభ్యుడిగా ఉన్న కౌశిక్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని లేనియెడల హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest