UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏ ఎం సి చైర్మన్ ఎల్ రుప్ల నాయక్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ 107 వజయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రూప్ల నాయక్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత అని కొనియాడారు. ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1965 వ సంవత్సరంలో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నరు. జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చి గరీబ్ హఠావో అను నినాదంతో ముందుకు వెళ్లారని ఆమెను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు కాంపల్లి రాజేశం, ఈదుల శ్రీనివాస్, గంధం మహిపాల్, అలువాల రాజేశం, శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, వడ్లకొండ అంజయ్య, జనగామ తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు ఓరెమ్ చిరంజీవి, ఉత్తం రాజయ్య తో పాటు హమాలీలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest