UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిఫాంల విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతుందని పాత దుస్తులతో విద్యార్థులు కాలం వెళ్ళదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు యూనిఫాం లను కుట్టించేందుకు సంబంధిత ఏజెన్సీలకు అందజేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు సకాలంలో యూనిఫాం, షూస్, కాస్మోటిక్ చార్జీలు వెంటనే అందించి వారిని ఆదుకోవాలని మల్లేశం కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest