54వ డివిజన్ లో భాగ్యం ను వరించనున్న విజయం
భారీ మెజార్టీ దిశగా సిపిఐ అభ్యర్థిని భాగ్యలక్ష్మి
కొత్తగూడెం (తెలంగాణ వాణి) పేరుకు తగ్గట్లుగా
నే 54వ డివిజన్ సిపిఐ అభ్యర్థి భాగ్యలక్ష్మిని విజయభాగ్యం వరించనుంది. రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిని పల్లపోతు భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి భర్త పల్లపోతు సాయి ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఆ ప్రాంత ప్రజల అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సామాజిక వర్గాల సమీకరణలను ముందుగానే సమీక్షించుకున్న అభ్యర్థి అన్ని వర్గాల ఓటర్లను నేరుగా కలిసి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఆదివారం డివిజన్ వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించడంతో గెలుపు తీరాలు చేరడం సునాయాసమే అని తేలిపోయింది. ఆ డివిజన్ వ్యాప్తంగా మొత్తం 2234 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1189 మంది, పురుష ఓటర్లు 1045 మంది ఉండగా కాగా ఇక్కడ 144 మంది మహిళా ఓటర్లు ఎక్కువ. 750 మంది మైనార్టీ ఓటర్లు ఉన్న ఈ డివిజన్ లో గెలుపు ఓటములను మైనార్టీలే శాసించే అవకాశం ఉంది. మైనారిటీలు అగ్రభాగాన పల్లపోతు వెంట ఉండటం విశేషం. కాంగ్రెస్, బియర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతునప్పటికి ఓటర్లు పల్లపోతు వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ డివిజన్లో మొదటి నుండి బలమైన పోటీ ఉంటుందని భావించినప్పటికీ రోజురోజుకి మారిన సమీకరణాలతో 54వ డివిజన్ సిపిఐ ఖాతాలో పడనుంది. మొత్తoగా 20% ఓట్ల మెజార్టీతో సిపిఐ అభ్యర్థి పల్లపోతు భాగ్యలక్ష్మి గెలిచే అవకాశాలు సుష్పష్టంగా కనిపిస్తున్నాయి.

