UPDATES  

NEWS

కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు  లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ! ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్

 మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి మాట్లాడుతూ మంత్రిని హేళన చేస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నిన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 51 వేల పైచిలుకు ఓట్లతో ఓడించినా నీకు సిగ్గు లేదు, నీ నీచమైన బూతు మాటలు మానుకోవాలి ,నీవు ఒక ఇసుక దొంగవి మంత్రిని విమర్శించే నైతిక విలువలు లేవానీ నీవు వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను ఈ రాష్ట్రంలో తిరగనియ్యం నిన్ను బొంద పెడతామని హెచ్చరించారు. నీ పార్టీ లో దొంగల గురించి దోపిడి దారుల గురించి మాట్లాడు, లాభాలలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నీ పార్టీ నాయకులు నీచులు వారి గురించి మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గు నీతి నిజాయితీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు పై లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా ధనాన్ని దోచుకొని లక్ష కోట్లు తిన్న మీ మాజీ ముఖ్యమంత్రిని తిట్ట మనీ ఘాటుగా విమర్శించారు. దోపిడి దారులు ఎవరో మోసగాళ్ళు ఎవరో గాడిద కిషోర్ నీ కళ్లు మనస్సు తెరిచి చూడు, కబర్దర్ బిడ్డ మా మంత్రిని ఇకపై ఏమైనా అంటే నీ నాలుక చీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ లు కాంపల్లి రాజేశం, జనగాం తిరుపతి, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు ఏదుళ్ల అంజయ్య, నాయకులు దూడ తిరుపతి, కాల్వల సతీష్ కుమార్, ఇరుగురాల మహేష్, చొప్పదండి మల్లేశం, కాంపెల్లి పోచయ్య, నేరువట్ల మల్లయ్య, బెక్కెం అశోక్, కొత్తూరు మల్లేష్, జేరిపోతుల శ్రీకాంత్, బెక్కెం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest