ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వీరిద్దరికి నోటీసులు అందిస్తామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఆసుపత్రి, అల్లోపతి, హోమియో యునాని ,ఆయుర్వేద డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్యశాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు ఆమె వెంట ఉన్నారు.



