UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ధర్మారం సంపూర్ణంగా బంద్

బందులో పాల్గొన్న కాంగ్రెస్, బిఆర్ఎస్, భాజపా నాయకులు

ధర్మారం (తెలంగాణ వాణి) బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బందుకు బీసీ ఐకాస ఇచ్చిన పిలుపుమేరకు ధర్మారం మండల కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఉదయం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా కు చేరుకుని వ్యాపార వాణిజ్య ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను హోటళ్లను బందు చేయించారు. మూడు పార్టీల నాయకులు బైకులపై పెద్ద ఎత్తున ధర్మారం అంత కలియ తిరుగుతూ నిరసన ప్రదర్శన చేశారు, అనంతరం మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మూడు పార్టీల నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం మూడు పార్టీల నాయకులు అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేసి మానవాహారంగా ఏర్పడి నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం వివిధ పార్టీల ప్రధాన నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు ఉందక వెనకబడి పోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బారాస, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest