UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 Central Govt Jobs:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది.పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి.పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు గా పేర్కొన్నారు.అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం ఇది చదవండి.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రెండు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్

అప్లై విధానం: ఆన్‌లైన్‌ విధానంలో కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు).. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500 గా నిర్ణయించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest