పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి……ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్,ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బూర్గంపహాడ్, అశ్వాపురం,మణుగూరు,పినపాక మండలాల్లో బీటి రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఆయన పర్యటనలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్,ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు.
కష్టపడి.. ఇష్టపడి చదివితే అన్ని సాధ్యమే: పి హెచ్ డి స్కాలర్ రంజిత్ బాదావత్
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం నంద్యా తండ గ్రామవాసి బాదావాత్ సేవియా కుమారుడు బాదావత్ రంజిత్ కుమార్ 2022 డిసెంబర్ సెషన్ లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) సాధించి తదుపరి అతిథి అధ్యాపకులు జూనియర్ లెక్చరర్ గా ములకలపల్లి జూనియర్ కళాశాలలో పనిచేస్తూన్నారు.ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక యూనివర్సిటీలో పి హెచ్ డి సీటు పొంది మరల తను మాస్టర్ చేసినటువంటి శాతవాహన యూనివర్సిటీలో పి. హెచ్ డి సీటును సాధించాడు.సాధ్యం కానిది […]
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025 జూన్) 2025 నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది.ఇక టెట్ ఆన్లైన్ ఆధారిత కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2025 జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటన వెలువరించింది. టెట్కు […]
జగిత్యాల కలెక్టరేట్లో అవినీతి కలకలం

లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు జగిత్యాల (తెలంగాణ వాణి) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ […]
పట్టపగలు నడిరోడ్డుపై గోమాత వధ

బహిరంగ ప్రదేశాల్లో వధిస్తున్న చోద్యం చూస్తున్న అధికారులు కోదాడ (తెలంగాణ వాణి) పట్టణ పరిధిలో పట్టపగలు నడి రోడ్డు మీదనే ఆవులను వధిస్తున్నారు. పట్టణంలో ఆవుని కోసిన ఒక సంఘటనలో ఇరుగు పొరుగున నివాసం ఉన్న వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమీషనర్ దిగువ అధికారులకు చెప్పి, అంతటితో తన బాధ్యత పూర్తయినట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని తెలిసి ఆవుని “వధించిన వారు” ఫిర్యాదు చేసిన కుటుంబంలోని మహిళల మీద దాడి చేశారని, […]
పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు
ఇల్లెందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఏడెడ్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటు తెలిపారు.ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఇల్లందు ఏరియా సింగరేణి పాఠశాల […]
ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించండి: టిఎస్ టిటిఎఫ్ ఆధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్,బానోత్.రాములు నాయక్,
బయ్యారం మండల కేంద్రములో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్.రాములు నాయక్,గౌరవ అధ్యక్షుడు శివ నాయక్, ఉపాధ్యక్షులు రంగన్న ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డి ఎ లను ప్రకటించాలని,జి ఓయంఎస్ నెం.3 స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలని,పీఆర్సీ […]
వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్
పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో చుంచు పల్లి మండలం బాబు క్యాంప్ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు పట్టాభి దంపతులతో కలిసి మామిడి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న చిరంజీవి మూడు విశ్వా మిత్ర చౌహన్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి

హైదరాబాద్ (తెలంగాణ వాణి) మానేటి మట్టిల పుట్టిన మంచి ముత్యం.నారాయణ పురం టంకసాలలో రూపుదిద్దుకున్న పదహారణాల పల్లెనాణేం. తాడితపీడిత జనపక్షం వహించిన అలుపెరుగని అభ్యుదయ కలం. దొరతనాన్ని,దోపిడీని ఎదిరించిన ధిక్కార గళం.పరిశోధనా రంగాన్ని పరిపుష్టం గావించిన శాస్త్రీయ దృక్కోణం.భాషా శాస్త్రంలో నిరంతర శ్రమకు,పరిశ్రమకు నిదర్శనంగా నిలిచిన నిలువెత్తు సంతకం.సృజన రంగాన సల్పిన అవిరళకృషికి,పట్టుదలకు పెట్టింది పేరుగా నిలబడ్డ నిలువుటద్దం. భారత దేశ సమైక్యత,సమగ్ర తలను సంరక్షించిన భారతీయ సాహిత్యానికి పట్టుగొమ్మ.తెలుగు, హిందీ,ఆంగ్లం,తమిళం,కన్నడం, మలయాళం,బెంగాలీ,అస్సామీ, ఒరియా,గుజరాతీ,పంజాబీ,ఉర్దూ, సంస్కృతం,మరాఠీ పద్నాలుగు భాషల్లో […]
మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్
పాల్వంచ:ఉన్నత అధికార ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ పాల్వంచ ఇంజనీరింగ్ సబ్ డివిజన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మరియు సహాయం ఇంజనీర్లు సీనియర్ అసిస్టెంట్ పాల్గొని చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరువ లేనివన్నారు.గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక […]