UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకున్న మహిళలు

శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు తమ ఇళ్లల్లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు.సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం,నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారని పలువురు మహిళలు పేర్కొన్నారు.

3 రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స లాపరోటమీ విత్ కోలా స్టమి (స్టొమా)

9 శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు …… నిజామాబాద్ ఆగస్టు 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో ఉన్న వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా […]

దాసాంజనేయ భజన మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు

లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రసిద్ధ దాసాంజనేయ భజన మందిరంలో మంగళవారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.పూజ అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఎస్ టి.టి.ఎఫ్ కమిటి 

  సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్,రాష్ట్ర సీనియర్ నాయకులు బానోత్ మంగీలాల్ నాయక్,భట్టు చందర్ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంగీలాల్ […]

గిరిజన సంక్షేమ శాఖ నాన్ టీచింగ్ స్టాఫ్ జిల్లా కార్యవర్గ ఎన్నిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాన్ టీచింగ్ స్టాఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ప్రచార కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. ఆదివారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని పీఎంఆర్సి భవనంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు ప్రమీల బాయి,కృష్ణార్జున రావు,ఏవో,రాంబాబు హెచ్ డబ్ల్యు ఓ,సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమణ మూర్తి,గౌరవ అధ్యక్షులుగా నారాయణ,ఉపాధ్యక్షులుగా ఉదయ్ కుమార్,సహాయ కార్యదర్శిగా ప్రసాద్,కోశాధికా […]

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు బోయినపల్లి ,జూలై 25 (తెలంగాణ వాణి) : తమతో చదివిన స్నేహితుడు కష్టాల్లో ఉండని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు,బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ. హెచ్. ఎస్ విలాసాగర్ పాఠశాలలో 2006-07 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడికి ఆర్థిక సాయం చేసారు,తమ స్నేహితుడి తండ్రి పొత్తూరి రామయ్య విలాసాగర్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ […]

ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బారాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు

ధర్మారం జులై 24 (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో నవయుగ చక్రవర్తి ప్రసిద్ధ కవి వర్ధంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన తన సామాజిక స్పృహతో కూడిన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం పొందాడని అన్నారు. ముఖ్యంగా కుల వ్యవస్థపై తన కవితల ద్వారా తిరుగుబాటు చేశాడని సమాజంలో అసమానతలను ఎత్తి చూపాడన్నారు.ఆయన […]

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.

మొక్కలే మానవాళికి జీవనాధారం అంటూ…. పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని మంచి ఆలోచనతో ఇంట్లో అందమైన మొక్కలు ఆక్సిజన్ మొక్కల పెంపకం పట్ల దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.గతంలో మొక్కలను కూడా వితరణ చేసినట్లు అయన పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు.

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు   వేములవాడ,జూలై 16 (తెలంగాణ వాణి) : వేములవాడ పట్టణంలోని వివేకానంద యూత్ (మార్కండేయ నగర్ కాలనీ) వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున పట్టణంలోని బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.తమ కాలనీ నుండి తలపై బోనాలతో,డప్పు చప్పులు,నృత్యాలు ఆట పాటలతో అమ్మవారి ఆలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నృత్యాలతో ఊరేగింపుగా సాగిన ఈ బోనాల ఊరేగింపు ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా […]