UPDATES  

 బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై

ధర్మారం (తెలంగాణ వాణి)

పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శీలం లక్ష్మణ్ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం అవార్డు అందుకున్నారు. రాష్ట్ర బెస్ట్ సిటిజన్ పోలీస్ గా 5వ ర్యాంక్ రావడం అది రామగుండం కమిషనరెట్ పరిధిలోని ధర్మారం మండలానికి రావడం చాలా సంతోషకారమని స్తానికులు అన్నారు. ఎస్సై లక్ష్మణ్ కు అవార్డు రావడం పట్ల స్థానిక నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest