UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వీరిద్దరికి నోటీసులు అందిస్తామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఆసుపత్రి, అల్లోపతి, హోమియో యునాని ,ఆయుర్వేద డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్యశాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు ఆమె వెంట ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest