UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను మంగళవారం ఇలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రోటోకాల్ బేసిడ్ వైద్యం, ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆరా తీశారు. మండల కేంద్రంలోని సాయిరాం హాస్పిటల్, కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి వీరిద్దరికి నోటీసులు అందిస్తామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ఆసుపత్రి, అల్లోపతి, హోమియో యునాని ,ఆయుర్వేద డెంటల్, ఫిజియోథెరపీ ఎవరైనా సరే వైద్య ఆరోగ్యశాఖలో తమ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్వహించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపాధికారి డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు ఆమె వెంట ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest