UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 అందెశ్రీ కి కొవ్వొత్తుల నివాళులు అర్పించిన నేతలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన తెలంగాణ ప్రజా గాయకుడు అందెశ్రీకి ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తుల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో అణగారిన వర్గాల కోసం తన గొంతు నే ఆయుధంగా మార్చుకుని పోరాడిన ప్రజా గాయకుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ యావత్ బహు జనులకు తీరనిలోటని అందె శ్రీ కేవలం గాయకుడే కాదు సమాజ హితం కోసం పాడిన సామాజిక వర్గాల నొప్పిని పదాల్లో చెక్కి గాత్రంలో పోసి ప్రజల హక్కుల కోసం పాటలను సృష్టించిన అరుదైన కళాకారుడని తెలంగాణ పల్లెల్లో ఉద్యమాల పోరాట ర్యాలీలో ప్రతిధ్వనించిన ఆయన పాటలు వేలాది మందికి మనోధైర్యాన్ని చైతన్యాన్ని నింపాయని అన్నారు. పేదల బాధను అర్థం చేసుకొని సున్నితమైన హృదయం అనిచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచిన అందెశ్రీ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని వని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ నెరువట్ల అభిలాష్ ,సాంస్కృతిక కళామండలి జిల్లా నాయకులు పిట్టల రమేష్, పోలవేణి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా టిపిసిసి సింగర్ కండ్లే అంజన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest