UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 అందెశ్రీ కి కొవ్వొత్తుల నివాళులు అర్పించిన నేతలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన తెలంగాణ ప్రజా గాయకుడు అందెశ్రీకి ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తుల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో అణగారిన వర్గాల కోసం తన గొంతు నే ఆయుధంగా మార్చుకుని పోరాడిన ప్రజా గాయకుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ యావత్ బహు జనులకు తీరనిలోటని అందె శ్రీ కేవలం గాయకుడే కాదు సమాజ హితం కోసం పాడిన సామాజిక వర్గాల నొప్పిని పదాల్లో చెక్కి గాత్రంలో పోసి ప్రజల హక్కుల కోసం పాటలను సృష్టించిన అరుదైన కళాకారుడని తెలంగాణ పల్లెల్లో ఉద్యమాల పోరాట ర్యాలీలో ప్రతిధ్వనించిన ఆయన పాటలు వేలాది మందికి మనోధైర్యాన్ని చైతన్యాన్ని నింపాయని అన్నారు. పేదల బాధను అర్థం చేసుకొని సున్నితమైన హృదయం అనిచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచిన అందెశ్రీ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని వని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ నెరువట్ల అభిలాష్ ,సాంస్కృతిక కళామండలి జిల్లా నాయకులు పిట్టల రమేష్, పోలవేణి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా టిపిసిసి సింగర్ కండ్లే అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 16 November 2025, 4:03 pm Posted by : TELANGANA VANI

అందెశ్రీ కి కొవ్వొత్తుల నివాళులు అర్పించిన నేతలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన తెలంగాణ ప్రజా గాయకుడు అందెశ్రీకి ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తుల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో అణగారిన వర్గాల కోసం తన గొంతు నే ఆయుధంగా మార్చుకుని పోరాడిన ప్రజా గాయకుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ యావత్ బహు జనులకు తీరనిలోటని అందె శ్రీ కేవలం గాయకుడే కాదు సమాజ హితం కోసం పాడిన సామాజిక వర్గాల నొప్పిని పదాల్లో చెక్కి గాత్రంలో పోసి ప్రజల హక్కుల కోసం పాటలను సృష్టించిన అరుదైన కళాకారుడని తెలంగాణ పల్లెల్లో ఉద్యమాల పోరాట ర్యాలీలో ప్రతిధ్వనించిన ఆయన పాటలు వేలాది మందికి మనోధైర్యాన్ని చైతన్యాన్ని నింపాయని అన్నారు. పేదల బాధను అర్థం చేసుకొని సున్నితమైన హృదయం అనిచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచిన అందెశ్రీ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని వని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ నెరువట్ల అభిలాష్ ,సాంస్కృతిక కళామండలి జిల్లా నాయకులు పిట్టల రమేష్, పోలవేణి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా టిపిసిసి సింగర్ కండ్లే అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest