UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తెలిపారు. రేపటి బంధు లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ నాయకులు బొల్లి స్వామి మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం లో వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు అమలు చేయవచ్చని రాసారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ బద్ద ప్రక్రియలో బీసీ లకు చట్ట బద్దంగా 42% రిజర్వేషన్ల కోసం జీవో విడుదల చేసిందని, ఎస్సీ, ఎస్టీ లు అందరం దీని అమలు కొరకు మద్దతుగా ఉన్నామని తెలిపారు. మాజీ మార్కెట్ చైర్మన్ కొత్త నర్సింహులు మాట్లాడుతూ సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ బద్దంగా చేసిన ప్రక్రియను గవర్నర్, రాష్ట్రపతి ల వద్ద బిల్లులను పెండింగ్ పెట్టుకుని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. బీసీ లందరు పార్టీలకతీతంగా రేపటి బంధుని విజయవంతం చేసి కేంద్రానికి మన బలం తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, నాయకులు పాలకుర్తి రాజేశం గౌడ్, సాగంటి కొండయ్య, వేల్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest