UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 New Toll System: టోల్‌ ట్యాక్స్ కలెక్షన్‌కు కొత్త సిస్టమ్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధితో పాటు కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఇందుకు అయిన ఖర్చులను తిరిగి రాబట్టేందుకు ఆయా వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు.

ఈ లావాదేవీల కోసం గతంలో నగదు వినియోగించేవారు. మారుతున్న కాలంతో పాటు తర్వాత వివిధ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం ఫాస్ట్‌ ట్యాగ్ ద్వారా టోల్ కలెక్షన్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో త్వరలోనే మార్పులు జరగనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హింట్ ఇచ్చారు. శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు.

 

కొత్త విధానంలో వాహనం కవర్ చేసిన దూరాన్ని బట్టి టోల్ మొత్తం వసూలు చేయబడుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. డబ్బు నేరుగా వినియోగదారుని బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ కానుందని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ టోల్ ట్యాక్స్ తగ్గించి సాఫీగా ప్రయాణం సాగేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

త్వరలోనే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు దీన్ని అమల్లోకి తీసుకువస్తారనే విషయంపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఈ నిర్ణయంపై అప్‌డేట్ కోసం వినియోగదారులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest