UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ మాయాజాలం

MRP కంటే అధిక ధరలకు విక్రయాలు

పాల్వంచ (తెలంగాణ వాణి)

పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యావసరాల కోసం వెళ్లే వినియోగదారులను దారుణంగా మోసం చేస్తుంది. MRP కంటే తక్కువకు అమ్మాల్సిన రిలయన్స్ మార్ట్ లో MRP కన్నా అధిక ధరలకు విక్రయిస్తు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం అనేది నేరమని తెలిసి కూడ ఇలా అమ్మడం ఏంటని అడిగిన వినియోగదారుడికి వ్యత్యాసం ఉన్న డబ్బులు తిరిగి ఇస్తామని ఇవన్నీ సాధారణమనట్టు మాట్లాడుతున్న సిబ్బంది ధోరణి విస్మయానికి గురిచేస్తోంది. పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ లో రుచి గోల్డ్ కంపెనీ కి చెందిన నూనె ప్యాకేట్ MRP ధర 125/- రూపాయలు కాగా 10 రూపాయలు ఎక్కువ 135/- కు విక్రయించడం జరిగింది. ఇలా ప్రతి రోజు ఎన్ని ప్యాకెట్ లు అమ్ముతున్నారో అన్నది అలోచించాల్సిన విషయం. పాల్వంచకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంతాల ఏజెన్సీ వాసులు సూపర్ మార్కెట్ లో తక్కువ ధరకు వస్తాయని ఇక్కడకు వచ్చి నిలువునా మోస పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటిపక్కనున్న షాపులను వదిలి సూపర్ మార్కెట్ మోజులో పడి రిలయన్స్ మార్ట్ కు వెళ్లి మోసపోవద్దని కొన్న వస్తువుల ధరలను చూసుకున్న తర్వాతనే బిల్లులు చెల్లించాలని బాధితులు అంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest