UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 ఢిల్లీలో దొంగలు ఎంతకు తెగించారు.. ఏకంగా జేపీ నడ్డా సతీమణి కారు గాయబ్

ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు. సెక్యూరిటీ దాదాపు క్యాబినెట్ మినిస్టర్ కు ఉన్నంత రేంజ్ లో ఉంటుంది. పైగా ఆయన చుట్టూ ఎప్పటికీ పోలీసులు ఉంటారు.

చివరికి ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఇలాంటి భద్రతే ఉంటుంది. కానీ అంతటి భద్రతను దాటుకొని దొంగలు వచ్చారు. పోలీసులు పహారా కాస్తున్న వారి కళ్ళు కప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారునే చోరీ చేశారు. దీంతో ఢిల్లీలో కలకలం నెలకొంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సతీమణికి HP 03 D 0021 అనే నెంబర్ ఉన్న తెలుపు రంగు టాప్ ఎండ్ ఫార్చునర్ కారు ఉంది. ఈ కారును ఇటీవల సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవిందు పూరి ప్రాంతంలో ఓ సర్వీస్ సెంటర్ లో సర్వీస్ కు ఇచ్చారు. ఈ కారుకు ఢిల్లీలోని గోవిందు పోరి ప్రాంతంలో నివసించే జోగిందర్ సింగ్ డ్రైవర్ గా ఉన్నాడు. సర్వీస్ లో భాగంగా కారును సర్వీస్ సెంటర్లో డ్రైవర్ పార్క్ చేశాడు. మధ్యాహ్నం భోజనం కోసం గోవింద్ పురి ప్రాంతంలో తన ఇంటికి వెళ్ళాడు. భోజనం చేసి తిరిగి వచ్చేసరికి సర్వీస్ సెంటర్లో కారు కనిపించలేదు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలే బిజెపి జాతీయ అధ్యక్షుడు భార్య కారు కావడంతో పోలీసులు ఆగమేఘాల మీద సర్వీస్ సెంటర్ వద్దకు వచ్చారు. సిసి కెమెరాలు పరిశీలించారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడారు. వారు మాత్రమే కాకుండా మరో ఆరు బృందాలు ఆ కారు గాలింపు కోసం రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు గుర్గావ్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. ఏకంగా జేపీ నడ్డా భార్య కారు చోరీకి గురి కావడం పట్ల నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.” నడ్డా భార్య కారు చోరీకి గురి అయింది కాబట్టి ఏడు బృందాల పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అదే సామాన్యుల వాహనాలు పోతే ఇలా రంగంలోకి దిగుతాయా.. పోలీసులు కనీసం పట్టించుకుంటారా” అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest