సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్
పాల్వంచ మండలం జెడ్పీ.హెచ్.ఎస్ పునుకుల పాఠశాలలో సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సి పి ఎస్ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించిన అనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ..సి.పి.ఎస్ వల్ల తమ భవిష్యత్ భద్రతకు భంగం కలుగుతోందని,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీహరి,పాఠశాల సిబ్బంది సుజాత,అనురాధ, ప్రమీల,శ్రీపల్లవి,సునీత, బాల్య, రగ్యా,ప్రభాకర్రావు పాల్గొన్నారు.
తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయితీలో రోడ్ల వెంబడి చెత్త,కాలువలు తీసిన మట్టి కుప్పలు మరియు ఇంటింటి నుండి చెత్త సేకరించడం వంటి పారిశుధ్య కార్మికులు మరియు పంచాయితీ సిబ్బంది పని తీరు బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అవగాహన కల్పిస్తున్న పంచాయతీ సర్పంచ్ తాటి అనిత మరియు ఉప సర్పంచ్ పాంచనపరుపు మహేష్,కార్యదర్శి సాంబయ్య […]
కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్
కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్. దేశంలోనే ఏకైక ఏజెన్సీ B.Ed కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరగేంట్రం… విశ్వసనీయ వర్గాల సమాచారం -5 వ డివిజన్ లో ఓటు హక్కు
తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి

సంగారెడ్డి జనవరి 21, (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక డిఎస్పి కార్యాలయంలో బుధవారం తెలంగాణవాణి దినపత్రిక క్యాలెండర్ ను నారాయణఖేడ్ డిఎస్పి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి మీడియా సంస్థల సేవలను ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, పాటిల్ ఉదయ్ కుమార్, షేక్ ఫయాజ్, ఇబ్రహీం ఖాన్ […]